prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 7:38 am Digital Edition : PRAJA VANI

గుర్రంపల్లి గ్రామంలో రాత్రి కురిసిన బారీ వర్షానికి కూలిన నిరు పేద ఇల్లు

*గుర్రంపల్లి గ్రామంలో రాత్రి కురిసిన బారీ వర్షానికి కూలిన నిరు పేద ఇల్లుగుర్రంపల్లి గ్రామంలో రాత్రి కురిసిన బారీ వర్షానికి కూలిన నిరు పేద ఇల్లు*

*నీరు పేదకు దక్కని ఇందిరమ్మ. ఇళ్లు పథకం పలుమార్లు అడిగిన ఫలితం శూన్యం..*

*తన కుటుంబానికి ఆశ్రయం  కల్పించాలి అంటున్న బాధితుడు లింగని వెంకటయ్య..*

షాద్ నగర్ ప్రజా వాణి జూన్ 13:

జిల్లేడు — చౌదరి గూడెం మండల పరిధిలోని గుర్రం పల్లి గ్రామంలో,, నిన్న రాత్రి కురిసిన  అతి భారీ  వర్షానికి చాలా గ్రామంలో పేదవారి  ఇళ్ళు కూలిన. ఘటనలు కనిపిస్తున్నాయి  అయితే ప్రస్తుతం గురంపల్లి  గ్రామానికి చెందిన  నిరుపేద. రెక్కాడితే కానీ   డొక్కాడని కుటుంబం  తనది.. అతనే  లింగని వెంకటయ్య తనకు  తన కుటుంబానికి  సొంత ఇళ్లు ఇందిరమ్మ పథకంలో మంజూరు చేయాలని  చాలా సార్లు  గ్రామ. అధికారులకు  మరియు ప్రజా ప్రతినిధులకు. మొర పెట్టుకున్న వారు తనకు న్యాయం చేయలేదని  ఆయన చాలా బాధతో కన్నీరు మున్నీరు. అయ్యారు. ప్రస్తుతం వర్షాకాలం సమీపించినందున తన  కుటుంబం నిలువ నీడ లేకుండా అయ్యిందని  తనకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మరియు తన కుటుంబానికి ఆశ్రయం కల్పించాలని మరియు స్థానిక  ప్రజా  ప్రతినిధులు తన కుటుంబానికి  ఇళ్లు మంజూరు చేయాలని  ఆయన మీడియాకు తెలిపారు …..