prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 8:25 pm Digital Edition : PRAJA VANI

గుడుంబా స్థావరాల గాలింపు కోసం రేనియ తండా దిగ్బంధం

గూడూరు మండల ప్రతినిధి:- ఆగస్టు 05. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ సూచనల మేరకు, డి.ఎస్. పి. తిరుపతి రావు ఆదేశాల ప్రకారం, కొత్తగూడ మండల కేంద్రం పరిధిలోని  రేణ్య తండా గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. దీనిలో భాగంగా 38 లీటర్ల గుడుంబా, 120 కేజీల బెల్లం, ఎనిమిది వందల లీటర్ల గుడుంబా పానకం, స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఈ ఆపరేషన్ లో గూడూరు సిఐ వినయ్ కుమార్, కొత్తగూడా, గంగారం ఎస్సైలు  రాజ్ కుమార్, కోటేశ్వరరావు లతో పాటు, స్పెషల్ పార్టీ, సివిల్, టీజీఎస్పి సిబ్బంది మొత్తం కలిపి 40 మంది పాల్గొన్నారు.