గుగ్గిళ్ల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన
కాంగ్రెస్ పార్టీ నాయకులు
బెజ్జంకి, ఏప్రిల్ 19(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు గుగ్గిళ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీరామోజు (దుర్శెట్టి) శిరీష (భర్త: రమణాచారి)కు రూ. 28,000/- విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు తిప్పరవేణి బాబు, మాజీ అధ్యక్షులు మైలా బాలయ్య, చెప్యాల సారయ్య, వార్డు సభ్యులు దుశెట్టి రాజిరెడ్డి, సీనియర్ నాయకులు కరుణాల రాజయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు బోయిని ప్రశాంత్ శ్రీనివాస్, సుదమల్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.