బెజ్జంకి, ఆగస్టు 5 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో శ్రీ రేణుక మాత గౌడ యువసేన (రిజి. నెం. 29/2014) ఆధ్వర్యంలో బుధవారం సంఘ సభ్యుల సమక్షంలోనూతన పాలక వర్గాన్నీ ఎన్నుకోవడం జరిగింది.ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా చెప్యాల సాయిరాం, ఉపాధ్యక్షుడిగా చెప్యాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా చెప్యాల పృథ్విరాజ్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ, తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రేణుక మాత గౌడ యువసేన సభ్యులు పాల్గొన్నారు.