
నెల్లూరు జిల్లా ప్రజా వాణి న్యూస్ (ఏప్రిల్20) కలువాయి మండలo చీపినాపి గ్రామంలోనిఅరుంధతి వాడకు చెందిన గార్లపాటి మహేంద్ర- నాగమ్మ ల కుమార్తె గార్లపాటి చరీష్మ వయస్సు 7 సంవత్సరాలు చీపినాపి గ్రామంలోని స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చీపినాపి SC నందు రెండో తరగతి చదువుతున్నది గత కొంతకాలంగా గుండె వ్యాధి సమస్యలతో బాధపడుతూ ఈ రోజు ఉదయం 10 గం లకు నెల్లూరులోని హాస్పటల్ నందు ఆకస్మిక మరణం చెందారు. విషయం తెలుసుకున్న కలువాయి మండల విద్యాశాఖ అధికారి-2 సడ్డా జనార్దన రెడ్డి గారు చీపినాపి లో విద్యార్థి అంత్యక్రియలకు హాజరై వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది ధనాల కిష్టయ్య CRMT పెంచలయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.