ప్రజావాణి న్యూస్ (మార్చి 08) కలసపాడు మండలం మహానంది పల్లె గ్రామానికి చెందిన దారం చలపతి శనివారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన భార్య, కుమారుడు మృతి చెందగా కుమారుని పిల్లలను ఆయనే పోషిస్తున్నట్లు సమాచారం.. ఆయన మృతి చందడంతో పిల్లలు రోడ్డున పడ్డారు. ఆయన మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు,