బెజ్జంకి, ఏప్రిల్ 18(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుండారం గ్రామంలో శనివారం డీఆర్డీఏ పీడీ జగత్ జయదేవ్ ఆర్య ఉపాధి హామీ పనుల పర్యవేక్షణలో భాగంగా గుండారం ఫీడర్ ఛానల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫీడర్ ఛానల్ లోతును పెంచాలని సూచించారు.అనంతరం ప్యాడి సెంటర్ను పరిశీలించి,ఉపాధి హామీ పనులు జరిగే చోట ప్రజలకు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అలాగే టెంట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్, సర్పంచ్ తాళ్లపల్లి బీమయ్య, ఏపీవో, టీఏ, సీసీలు తదితరులు పాల్గొన్నారు.