prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 11:39 am Digital Edition : VIJAYKUMAR SIDDIPET

గజ్వేల్  ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవల దారుణ పరిస్థితి– రోగులు ఆగ్రహం…

గజ్వేల్  ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవల దారుణ పరిస్థితి– రోగులు ఆగ్రహం..

సిద్దిపేట్, ఏప్రిల్ 27, ప్రజావాణి

గజ్వేల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పూర్తిగానిర్లక్ష్యానికిగురయ్యాయని రోగులు,వాళ్ల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు, నర్సింగ్ అసిస్టెంట్లు తమ విధులను పక్కనపెట్టిగుంపులుగుంపులుగానిలబడివ్యక్తిగతంగామాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారనిఆరోపణలువెల్లువెత్తుతున్నాయి.రోగుల వేదన ప్రకారం, ఆసుపత్రికి వచ్చే వాళ్ల కి సమయానికి పరీక్షలు చేయకపోవడం, చికిత్సను నిర్లక్ష్యంగా ఆలస్యం చేయడం సాధారణంగా మారిందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా సిబ్బంది స్పందన లేకపోవడం వల్ల ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవుతున్నాయనిఆవేదనవ్యక్తంచేస్తున్నారు.ప్రభుత్వఆసుపత్రిఅయినప్పటికీ, ఇక్కడి సేవలు పూర్తిగా పడిపోయాయని,బాధ్యతారాహిత్యంపరాకాష్టకుచేరుకుందనిస్థానికులుమండిపడుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని నిర్లక్ష్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే పరిస్థితి మరింత విషమించొచ్చనిహెచ్చరిస్తున్నారు.