Writing
గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన లక్ష్మీ నరసింహ స్వామి
బెజ్జంకి, ఏప్రిల్ 3 (ప్రజావాణి):
సిద్దిపేట జిల్లా బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహనంపై స్వామివారు పురవీధుల్లో విహరించడం ఎంతో మహిమాన్వితమైన ఘట్టంగా నిలిచింది.
ఈ గజవాహన సేవకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. గజం (ఏనుగు) ఐశ్వర్యం, శక్తి, రాజసత్వానికి ప్రతీకగా భావిస్తారు.
భక్తులు ఇలాంటి వేళల్లో స్వామివారి దర్శనం పొందడం గొప్ప అదృష్టంగా భావించి, గ్రామమంతా భక్తి భావంతో నిండిపోయింది. మంగళవాద్యాలు, హారతుల మధ్య ఘనంగా ర్యాలీ నిర్వహించారు.