వైయస్సార్ కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే12) పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు.ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలనీ ప్రార్థించిన ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చక్రాయపేట మండలంలో నిర్వహిస్తున్న హనుమాన్ శోభాయాత్ర ను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన వైయస్ అవినాష్ రెడ్డి ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి కామెంట్స్ వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 26 కోట్ల రూపాయలతో గండికి క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం సంతోషంగా ఉంది.రెండేళ్ల క్రితమే నూతన ఆలయం పూర్తయినప్పటికీ పలు కారణాలతో ప్రారంభానికి నోచుకోలేదు.ప్రధాన ఆలయంతోపాటు రాజగోపురాలు అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. రేపటినుండి భక్తులకు ఆంజనేయస్వామి మూల విరాట్ దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది.26 కోట్లు వెచ్చించి ఆలయ అభివృద్ధికి సహకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంజనేయస్వామి భక్తుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం