సిద్దిపేట జిల్లా, మార్చి 11, ప్రజావాణి
కోహెడ మండలంలో తంగళ్ల పల్లి గ్రామ శివారులో దాదాపు 23 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ పనులను జిల్లా కలెక్టర్ కె. హైమావతి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ ప్రాంతం మొత్తం కలియ తిరిగారు. రాష్ట్రంలోనే నిర్మాణ పురోగతిలో మొదటి స్థానంలో ఉందని 23 ఎకరాల్లో అతి పెద్ద విద్యాసంస్థ నిర్మాణం కావున మంచి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణిత కాల వ్యవధిలో యుద్ద ప్రతిపాదకన పూర్తి చెయ్యాలని, ఈడబ్ల్యూఐడిసి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారులు తరుచు పర్యవేక్షణ చెయ్యాలని సూచించారు.