ఎండపల్లి మండలం కొత్తపేటలో ఈ రోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. సర్పంచ్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మపురి జూనియర్ సివిల్ జడ్జ్ యోగి జానకి హాజరయ్యారు. 14 ఏళ్లలోపు పిల్లలను పనులకు పంపకుండా, బడికి పంపి వారిని విద్యావంతులను చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, బార్ అసోసియేషన్ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.