కొందుర్గు పర్యటనలో పలువురిని పరామర్శించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
కొందుర్గు పర్యటనలో పలువురిని పరామర్శించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదానికి గురైన కొందుర్గు మండల రేగడి చిల్కమరి గ్రామానికి చెందిన రాంచెంద్రి శ్రీరామ్,బాలయ్య,రాములు మల్లేష్,మరియు పర్వాతపూర్ గ్రామానికి చెందిన విద్యాసాగర్ తదితర బీఆర్ఎస్ కార్యకర్తలను ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని,త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించారు.ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్,కొందుర్గు మండల సర్పంచులు,మాజీ సర్పంచులు,బీఆర్ఎస్ నాయకులు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.