▪️విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: తహసిల్దార్ మాలతి
చిన్నశంకరంపేట,ఆగస్టు 01, మన ప్రజావాణి: మండల కేంద్రంలో ని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాని తహసిల్దార్ మాలతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని స్టోరోజి గదిని, బియ్యపు నిల్వల, త్రాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కు సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, ప్రధానోపాధ్యాయురాలు గీత, సిబ్బంది తదితరులు ఉన్నారు.