- బెజ్జంకి, మే 3 (ప్రజావాణి)
కరీంనగర్లో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం,బెజ్జంకి మండల అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి,బెజ్జంకి మండల అధ్యక్షులు కొలిపాక రాజు, సింగిరెడ్డి కృష్ణారెడ్డి, తిప్పర్తి నిఖేష్, వాసు తదితరులు పాల్గొన్నారు.