prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 12:49 pm Digital Edition : RAJASHEKARREDDY

కేంద్రమంత్రి బండి సంజయ్ ని కలిసిన గుగ్గిళ్ళ గ్రామ గౌడ కులస్తులు ఎల్లమ్మ గుడి పునర్నిర్మాణం, బోర్, నిధులు మంజూరుకీ వినతిపత్రం అందజేత

 

బెజ్జంకి,మే 3(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామానికి చెందిన గౌడ కులస్తులు గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకా మాత ఎల్లమ్మ గుడి పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని,నీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని దేవస్థాన ఆవరనలో బోర్ మంజూరు చేయాలనీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో చెప్యాల లక్ష్మన్, చెప్యాల ఈశ్వరయ్య, చెప్యాల సత్తయ్య, చెప్యాల సారయ్య, రామకృష్ణ, లక్ష్మణ్,సాయిరాం, చెప్యాల కిష్ట స్వామి, చెప్యాల పర్షరాం, , పంతంగి సాయి ప్రసాద్, శరత్ గౌడ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.