prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 7:20 am Digital Edition : PRAJA VANI

కృత్రిమ మేధస్సు(ఏఐ)పై  ఉపాధ్యాయులకు శిక్షణ

మండల విద్యాధికారి చదువుల సత్యనారాయణ.

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల ప్రభుత్వ, ప్రాథమిక, ప్రాథమికొన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జిటీ లకు మొదటి విడత మూడు రోజుల పౌండేషన్ లీటరసీ న్యూమరసి రెమిడీయేషన్ పై మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో మంగళవారం నుండి జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి చదువుల సత్యనారాయణ హాజరై ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వర్క్ బుక్స్ ఆధారిత విద్యాబోధన,ఆటలు,కృత్రిమ మేధస్సు (ఏఐ )బోధన,సమగ్ర మూల్యాంకనం పై శిక్షణ ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి రీసోర్స్ పర్సన్స్ గా శ్రీనివాస్,హర్షవర్ధన్ రెడ్డి,వంశీకృష్ణ, విజయ,సీఆర్పీ రవికుమార్ పాల్గొన్నారు.