prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 June 2026, 7:57 am Digital Edition : PRAJA VANI

కారు బైక్ ఢీకొని ఒక్కరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు

కారు బైక్ ఢీకొని ఒక్కరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్త పల్లి గోరి మండలచెన్నాపూర్ గ్రామానికి చెందిన ఒన్నాల మొగిలి 59 సంవత్సరాలు తన భార్య సరోజన 55 సంవత్సరాలు ఇద్దరు తిరుమలగిరిలో మొగిలి బావకు ఆరోగ్యం బాగాలేనందున చూద్దామని వెళుతుండగా దమ్మన్నపేట క్రాస్ వద్ద పరకాల నుండి భూపాలపల్లి వైపు వెళుతున్న కారును నడుపు పసిక ఆకాష్ సన్నాఫ్ రాజశేఖర్ వయసు 24 సంవత్సరాలు అతివేగంగా అజాగ్రత్తగా కారు నడిపి మొగిలి నడుపుతున్న టీవీయస్ చాంప్ వాహనాన్ని వెనకాల నుండి బలంగా గుద్దగా మొగిలి సరోజన ఎగిరి కింద పడి పరకాల హాస్పటల్కి 108లో షిఫ్ట్ చేయగా హాస్పిటల్ లో మొగిలి మరణించినాడని నిర్ధారించగా, సరోజనను మెరుగైన చికిత్స కోసం వినూత్న హాస్పిటల్ లో అడ్మిట్ అయిందని మృతుని కొడుకు ఒన్నాల రమేష్ వయసు 43 సంవత్సరాలు దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా రేగొండ ఎస్సై దాసరి సుధాకర్ తెలిపినాడు