కడపజిల్లాప్రజావాణిన్యూస్ఏప్రిల్10)కాజీపేట మండలం అగ్రహారంలో కీర్తన అనే విద్యార్థిని గొంతు కోసి కిరాతకంగా చంపిన వెంకటేష్.కీర్తన కాజీపేట ఏపీ మోడల్ స్కూల్ లో సెకండ్ ఇయర్ పూర్తి చేసింది.కీర్తన తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన సందర్భంలో ఎవరూ లేని సమయంలో ఇంటిలోకి ప్రవేశించి అమ్మాయిని గొంతు కోసినట్లు సమాచారం.ఇరువురు ఒకే కులానికి చెందినవారు కావడం గత కొంతకాలంగా కీర్తనను ప్రేమిస్తున్నట్లు సమాచారం.కీర్తన తండ్రి రామకృష్ణ ఇంటి వద్ద వచ్చి చూడగా రక్తపు మడుగుల్లో పడి ఉండడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు.కీర్తన మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపిన బంధువులు.నిందితున్ని మైదుకూరు పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్న పోలీసులు.