ప్రజావాణి న్యూస్(మార్చి31) కడపజిల్లా పర్యటనకు విచ్చేసిన జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారిని ఉమ్మడి కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.కడపలోని ఆర్అండ్బి గెస్ట్ హౌస్లో జరిగిన ఈ భేటీలో మంత్రి గారికి పుష్పగుచ్ఛం అందజేసి ,శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, చెరుకూరి రవికుమార్, అరవ శ్రీనివాసులురెడ్డి, పరిటాల వెంకట సుబ్బయ్య,పాలకొండు రాజశేఖర్ రెడ్డి,పోతిరెడ్డి రెడ్డయ్య, చంద్రగిరి ప్రహ్లాద్ రెడ్డి, కల్లూరి దుగ్గిరెడ్డి, పామూరి బాలి రెడ్డి,మాచుపల్లి కృష్ణారెడ్డి,ఉప్పతి సుబ్బా రెడ్డి,అందురు వెంకట సుబ్బా రెడ్డి, కోటపాటి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.