prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 12:06 pm Digital Edition : PRAJA VANI

ఓడెడ్ గ్రామంలో తాగునీటి సంక్షోభం<br>

ఓడెడ్ గ్రామంలో తాగునీటి సంక్షోభం

వెంటనే పైప్‌లైన్ మరమ్మతులు చేపట్టాలి: సర్పంచ్ కవిత కిషన్ రెడ్డి

మంథని నియోజక వర్గం, మే 28, ప్రజావాణి:

ముత్తారం మండలం ఓడెడ్ గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల కారణంగా తాగునీటి పైప్‌లైన్ ధ్వంసమై గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచ్ పోతుపెద్ది కవిత కిషన్ రెడ్డి తెలిపారు. మానేరు నుంచి గ్రామానికి వచ్చే తాగునీటి పైప్‌లైన్‌ను మంగళవారం హైవే పనుల కోసం గుంత తవ్వే సమయంలో తొలగించడంతో నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. ఘటనపై హైవే అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఎవరూ అందుబాటులో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే వేసవి తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పైప్‌లైన్ మరమ్మతులు చేపట్టి నీటి సరఫరా పునరుద్ధరించాలని ఆమె కోరారు.