prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 1:42 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో పాల్గొన్న కోరుబోతు నాగరాజు

ఘట్కేసర్ మండల పరిధిలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు కోరుబోతు నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్లకు నమోదు, సవరణ, మార్పులు మరియు ఇతర అవసరమైన దరఖాస్తు ఫారాల గురించి అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో బీఎల్‌వోలు రజిత, పద్మ ఓటర్లకు ఫారాల పంపిణీ, వివరాల సేకరణ మరియు నమోదు ప్రక్రియలను పర్యవేక్షించారు. ఓటర్లందరూ తమ వివరాలను సరిచూసుకుని అవసరమైన మార్పులు చేసుకోవాలని సూచించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు కోరుబోతు నాగరాజు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.