prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 1:45 am Digital Edition : PRAJA VANI

ఎస్ఎస్సి ఫలితాల్లో గ్రీన్ వుడ్ ప్రభంజనం

*ఎస్ఎస్సి ఫలితాల్లో గ్రీన్ వుడ్ ప్రభంజనం*

మందమర్రి (మన ప్రజావాణి) ఏప్రిల్ 29

మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో గల గ్రీన్ వుడ్ పాఠశాల విద్యార్థులు ఎస్ఎస్సి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు  సాధించి ప్రభంజనం సృష్టించారు. మంగళవారం విడుదలైన  ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు మాటేటి నిహాల్ 581 మార్కులు,  సందేనబోయిన తనుశ్రీ 578 మార్కులు, చుంచు సాయి తేజస్వి 577 మార్కులు సాధించారని పాఠశాల ప్రిన్సిపాల్ చంద్రమోహన్ తెలిపారు. పదో తరగతిలో పాఠశాల విద్యార్థులు 100 శాతం ఫలి తాలు సాధించారన్నారు. మొత్తం 31 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 27 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్  భరద్వాజ నాయుడు, ఏజిఎం పవన్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ తిరుపతి, హెడ్  మిస్సెస్ క్రిస్టినా పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.