ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ధర్మపురి ఫిబ్రవరి 04 (ప్రజావాణి):
జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల అభివృద్ధికి 5 వందల కోట్ల రూపాయలు ఇస్తానని కేసీఆర్ మాట తప్పారని మండి పడ్డారు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురిని ఎందుకు పట్టించుకోలేదని విమర్శించారు. ధర్మపురి లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గోదావరి పుష్కరాలకు అధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ధర్మపురిలోని 15 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.