ఎండపల్లిలో ఉత్సాహంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’
సర్పంచ్ మారం సునీత ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ, ముమ్మరంగా శ్రమదానం
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి, మార్చి 06 (ప్రజావాణి):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమం శుక్రవారం రోజున అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడింది. గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ మారం సునీత – జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి సర్పంచ్, ఇతర సిబ్బంది, గ్రామస్తులతో కలసి శ్రమదానం నిర్వహించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రగతి ప్రణాళిక లక్ష్యాలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు, గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఎంఈఓ, ఉప సర్పంచ్ దాసరి కళ్యాణి కొమరయ్య, వార్డు సభ్యులు బొంగాని మాధవి, ఇప్ప రాజేశం, సంపతి స్వామి, దేవి రవీందర్, దాసరి మల్లేశం, రేగుంట అంజి, సతీష్ గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో గ్రామస్తులు.