ఎండపల్లిలో అంబేద్కర్కు ఘన నివాళి.. ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి మెరుగు జానికి సన్మానం
[video width="856" height="480" mp4="https://prajavaani.net/wp-content/uploads/2026/06/InShot_20260614_130107939.mp4"][/video] ఎండపల్లి మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రతి నెల ఒక విశిష్ట అతిథి చేతుల మీదుగా పూలమాల వేసే నూతన కార్యక్రమం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజరాంపల్లి ఉప సర్పంచ్ మెరుగు జాని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇటీవలే ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన జానిని సంఘ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత, బీసీ నాయకులు సంఖ్యలో పాల్గొన్నారు.