prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 3:04 pm Digital Edition : VEMULARAMESH MOTHE

ఉపాధి పనులను సందర్శించిన మండల ఎంపీడీవో…….

ఉపాధి పనులను సందర్శించిన మండల ఎంపీడీవో…….

ప్రజావాణి ఏప్రిల్ 30:మోతే మండలం మామిళ్ళగూడెం గ్రామంలో ఉపాధి పనులను ఆకస్మికంగా మండల ఎంపీడీవో టి.ఆంజనేయులు గారు సందర్శించి నారు. వారు మాట్లాడుతూ ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి వ్యక్తి ఉదయాన్నే ఫీల్దు మీదకు రావాలని కోరారు…. పని ప్రదేశంలో తప్పకుండా టెంట్ ఏర్పాటు చెయ్యాలని మంచి నీటి సదుపాయాలు చూసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ లింగయ్య కు సూచించినారు.ఇ.సి శ్రీహరి గారు మాట్లాడుతూ ఒక వ్యక్తి ఒక రోజు కి 3 మీటర్ల పొడవు ,2 మీటర్ల వెడల్పు,1 ఫీట్ లోతు ఈ కొలతలు ప్రకారం పని చేస్తేనే రోజుకి 307 రూ|| ఖాతాలో జమఅవుతాయని అల చేయని యడల తక్కువ జమ అవుతావి అని వివరించి నాడు….ఇట్టి కార్య క్రమంలో గ్రామ కార్యదర్శి దేవేందర్ గారు, టి. ఏ. సురేష్ ,ఫీల్డ్ అసిస్టెంట్ జి.లింగయ్య, మెట్ మధు,ఎల్లారెడ్డి,వెంకటరెడ్డి,రామచంద్రారెడ్డి మరియు ఉపాధి కూలీలు తది తరులు పాల్గొన్నారు.