ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పియాసి మరియు డీఏలను ప్రకటించాలి ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పి ఆర్ సి మరియు డిఏల లను ప్రకటించాలి ఏపీటీఎఫ్ పోరుమామిళ్ల రీజియన్ పరిధిలో వివిధ మండలాలలో సమస్యలమీద పోరాటం లో,పామ్లెట్స్ ఆవిష్కరణ ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో జడ్పిపిఎస్ మెయిన్ పోరుమామిళ్ల, టేకుర్ పేట, ఎంపీ యూపీ స్కూల్ గిరినగర్, ఎస్ ఎ జడ్పీహెచ్ఎస్ నరసాపురం నందు ఆవిష్కరణ జరిగింది.
మరియు ఎమ్మార్వో దగ్గర సమస్యల మీద ఉపాధ్యాయులబృందం నిరసన తెలియజేసి, తాసిల్దార్ గారికి మెమొ రాండం ఇవ్వడము జరిగింది. ఏపీటీఎఫ్ స్టేట్, జిల్లా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులకు సీపీస్ రద్దు చేసి అందరికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చెయ్యాలి,చాలా సంవత్సరాలనుండిపని చేసే కాట్రాక్ట్ ఉద్యోగులు ( కస్తూర్బ, మోడల్ స్కూల్ సి ఆర్ ఎం టి ల జీతాలుపెంచాలి, రెగ్యులర్ కూడా చెయ్యాలని, ఉద్యోగుల కు రావలసిన బకాయిలు పి ఆర్ సి మరియు ఐ ఆర్ ఇవ్వకపోతే భవిష్యత్ లో ఢిల్లీ లో ధర్నా చేయవలసి వస్తుందని ప్రభుత్వం మీద నిరసన తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేంద్రనాథ్,రెడ్డి,భాస్కర్ రెడ్డి, ఎస్ ఏ సత్తార్,రామకృష్ణా రెడ్డి, జాఫర్, సుదీర్ గౌడ్,సుబ్బయ్య,రామమోహనరెడ్డి, బాలయ్య, గురయ్య, క్రిష్ణారెడ్డి, సీతారామిరెడ్డి, శేషారెడ్డి, భూపాల్ రెడ్డి,ck. శ్రీనివాసులురెడ్డి, S. మస్తాన్,నరసింహారెడ్డి, S. యాసిన్,జానకిరెడ్డి, గోపాలరెడ్డి, మస్తాన్ వల్లి పాల్గొన్నారు.