(ఈవిఎం) గోదాం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలన..
సిద్దిపేట జిల్లా, మార్చి 10, ప్రజావాణి కలెక్టరేట్ పక్కన గల ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె హైమావతి క్షేత్రస్థాయిలో సందర్శించారు. త్రైమాసిక పరిశీలీలనలో భాగంగా, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి ఈవిఎం గోదాం ను నియమావళి ప్రకారం ఓపెన్ చేసి సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాల వారీగా మిషన్ లను భద్రపరిచిన ద్వారాలను వాటికున్న సీల్ లను పరిశీలించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు ప్రకారం అన్ని భద్రత చర్యలు...