బెజ్జంకి, మే 26 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని కల్లేపల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం కురిసిన ఈదురు గాలులతో కూడిన వర్షానికి కూలిన ఇళ్లను బెజ్జంకి తహసీల్దార్ కళ్యాణపు శ్రీకాంత్, గ్రామ సర్పంచ్ బిగుళ్ల మోహన్ పరిశీలించారు.అకాల వర్షం, బలమైన గాలుల కారణంగా నష్టపోయిన కుటుంబాలను పరామర్శించి, నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం తరఫున సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈదురుగాలు వేస్తున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.