బెజ్జంకి, మే 5 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో రాత్రి అకస్మాత్తుగా ఈదురు గాలుల కారణంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్ వెంటనే స్పందించి గ్రామపంచాయతీ సిబ్బంది శివ, రాములను అప్రమత్తం చేశారు.
సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయితీ ట్యాంకర్ నీటితో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సకాలంలో స్పందించి మంటలను నియంత్రించడంతో సమీపంలోని పంట పొలాలకు పెద్ద నష్టం తప్పింది.
ఈ సందర్భంగా రైతులు గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్, గ్రామపంచాయతీ సిబ్బందికి, రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.