ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నిజం
ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో 9 ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించిందని, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లూ కట్టలేదని విమర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని, లబ్ధిదారుల ఖాతాల్లోకే నేరుగా డబ్బులు జమ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.