నర్మెట్ట గ్రామంలో 300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ..
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

సిద్దిపేట,మార్చి 22, ప్రజావాణి
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, ఆయిల్ ఫెడ్ రాష్ట్ర చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, ఉన్నతాధికారులు సురేంద్రమోహన్, యోగితా రాణా, నవీన్ నికోలస్,యస్మిన్ భాష, జిల్లా కలెక్టర్ హైమావతి, అధికారులతో కలిసి నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో 300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించారు,అనంతరం ఫ్యాక్టరీ నమూనా, పామ్ ఆయిల్ ఉత్పత్తి,తదితర అంశాలు, పరిసరాలను స్వయంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నా ముఖ్యమంత్రి.ఫ్యాక్టరీ ఆవరణంలో ఏర్పాటు చేసిన వివిధ కంపెనీల ఉత్పత్తుల స్టాల్స్ ను పరిశీలించారు,