prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 11:53 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం”నాగార్జున రెడ్డి

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్09) పోరుమామిళ్ల మండలం యారసాల గ్రామ సమీపంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఈ శ్రీ ప్రసన్న బండ్లమాంబ రాజ్యమాత దేవి బ్రహ్మోత్సవాలు ఈనెల 5వ తారీఖు నుండి ఏడో తారీఖు వరకు అత్యంత ఘనంగా జరిగాయి వేలాది మంది భక్తులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా  నాగార్జున్ రెడ్డి గారు మాట్లాడుతూ. శ్రీ ప్రసన్న బండ్లమాంబ. శ్రీ రాజమాత దేవి. గారు 19/2/2018 రోజున ఆలయానికి భూమి పూజ చేసి ఆలయం నిర్మించడం జరిగింది.మా తల్లి పోతిరెడ్డి కృష్ణమ్మ గారు అమ్మవారికి ఉత్సవ విగ్రహాలను ఇవ్వడం జరిగిందని అన్నారు. అమ్మవారు ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం. వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగ ప్రాప్తి .సమస్యలు ఉన్నవారు అమ్మవారి కి చెప్పుకోవడం ఆ సమస్య లు సమసిపోవడం. జరుగుతున్నదని భక్తుల నమ్మకం. బెంగళూరు నగరంలో అమ్మవారి గుడి ఆశ్రమం నిర్మించారు. అలాగే రాష్ట్రంలో అనేక చోట్ల అమ్మవారి గుడి ఆశ్రమాలు ఉన్నాయి. శ్రీ రాజమాత దేవి.సధర్మ సాధన నిలయం చంద్ర రావు.ప్రకాశం జిల్లా. అనుబంధ సంస్థగా వెలసి భక్తులందరి.మనోభీష్టములు నెరవేర్చుచూ ఎల్లప్పుడూ పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు . జరుగుచున్నాయి. శ్రీ రాజమాత దేవి గారు ఈనెల 15వ తారీకు వరకు ఇక్కడే ఈ గుడి ఆవరణలో ఉంటారని భక్తులు అమ్మవారిని దర్శించుకునే దానికి మంచి అవకాశం ఉంటుందని కావున. అమ్మవారిని దర్శించుకునే వారు వచ్చి దర్శించుకొని ఆమె ఆశీస్సులు పొందగలరని నాగార్జున రెడ్డి గారు అన్నారు.