అభివృద్ధిసంక్షేమంకాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన లక్ష్యంవొడితల ప్రణవ్
– నిరుపేద లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది.
– సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన
* హుజురాబాద్ ఇంచార్జి ప్రణవ్ బాబు
– సంక్షేమ పథకాల విషయంలో పారదర్శకత పాటిస్తున్నాం.ఎవరైనా డబ్బులు అడిగితే కఠిన చర్యలుతీసుకుంటాంఅవసరమైతే సస్పెండ్ కి వెనకాడం
జమ్మికుంట జూన్ 30 (ప్రజావాణి)
ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలో నిరుపేదలైన లబ్ధిదారులకు సంక్షేమం అభివృద్ధి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.మంగళవారం నాడు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 82 మంది,30 లక్షల విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు నేరుగా అందజేశారు.నిరుపేదలు పరిస్థితి బాగోలేక ఆసుపత్రులపాలైన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో అండగా ఉంటుందనిఇప్పటివరకు హుజురాబాద్ లో సుమారు 10కోట్ల రూపాయల చెక్కులు పంపిణీచేశామనిఅన్నారుఇందిరమ్మ ఇళ్ల విషయంలో పారదర్శకత పాటిస్తున్నాండబ్బులు అడిగితే సస్పెండ్ కి వెనకాడంరాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో పారదర్శకతను పాటిస్తున్నామని త్వరలో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వబోతున్నామని అన్నారు.సంక్షేమ పథకాల విషయంలో ఏవరైనా డబ్బులు అడిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో అన్ని మండలాల ప్రజా ప్రజాప్రతినిధులు,మండలాల అధ్యక్షులుఅనుబంధ సంఘాల నాయకులుసీనియర్ నాయకులుకార్యకర్తలుఅధిక సంఖ్యలో పాల్గొన్నారు

