అధికారుల ‘కక్కుర్తి’.నేతల ‘కబ్జా’.ఎగువతంబళ్లపల్లె గ్రామపంచాయతీ లోని సింగరాయపల్లె ఆర్ఓ ప్లాంట్ ప్రైవేట్ బోనస్!
కలసపాడు జూలై 03 ప్రజావాణి ప్రజాధనాన్ని నిలువునా ముంచేస్తూ,పేద ప్రజల దాహార్తిని పెట్టుబడిగా మార్చుకునే నీచమైన దందా కలసపాడు మండలంలో బహిర్గతమైంది.తంబళ్లపల్లె గ్రామపంచాయతీ పరిధిలోని సింగరాయపల్లె గ్రామంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఆరో వాటర్ ప్లాంట్ అవినీతి తిమింగలాల పాలిట కామధేనువుగా మారింది.ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించిన ప్లాంట్ను ప్రభుత్వానికి అప్పగించకుండా,అధికారుల అండతో ఒక స్థానిక రాజకీయ నాయకుడు పక్కదారి పట్టించి,బహిరంగంగానే ప్రైవేట్ దందాకు తెరలేపడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.అధికారుల కుమ్మక్కు భాగోతం.పక్కా స్కెచ్తో దోపిడీ!సింగరాయపల్లెగ్రామ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం...