అట్రాసిటీ బాధితులకు 2 బీహెచ్‌కే ఇళ్లు.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్

మేడ్చల్–మల్కాజిగిరి, మే 29 (ప్రజావాణి): దేశంలోనే తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు 2 బీహెచ్‌కే ఇళ్లను కేటాయించి అందించే నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభినందనీయమని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సమీక్ష సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో కలిసి అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, విజయేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు...