prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 9:47 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

అటెండర్ ఇంట ‘సిరి’ సంపదలు..ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) విజయవాడ వాణిజ్య పన్నుల శాఖలో అటెండర్‌గా పని చేస్తున్న ఒక సాదాసీదా ఉద్యోగి ఇంట కోట్లాది రూపాయల అక్రమాస్తులు బయటపడటం నగరంలో సంచలనం సృష్టించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.సోదాల్లో వెలుగుచూసిన ఆస్తుల వివరాలు అటెండర్ కొండపల్లి శ్రీనివాసరావు నివాసంతో పాటు అతని సోదరులు,బంధువుల ఇళ్లలో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి.ఈ తనిఖీల్లో సుమారు రూ.2 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు.బంగారం,వెండి 760 గ్రాముల బంగారు ఆభరణాలు,5 గోల్డ్ బిస్కెట్లు,సుమారు 7.8 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.వివిధ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.22 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు.ఒక ఖరీదైన బహుళ అంతస్తుల భవనం, నగర శివార్లలో విలువైన ఖాళీ స్థలాలకు సంబంధించిన పత్రాలను సీజ్ చేశారు. కేవలం అటెండర్ హోదాలో ఉంటూ ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా కూడబెట్టారనే కోణంలో విచారించగా.శ్రీనివాసరావు అధికారుల పేరు చెప్పి వ్యాపారులను బెదిరించి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువలెత్తాయి. అక్రమ సంపాదనతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న శ్రీనివాసరావుపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ ఇంకా ఎక్కువే ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.