prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 3:08 am Digital Edition : PRAJA VANI

అక్రమంగా రవాణా చేస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత*…  *సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు*…

*అక్రమంగా రవాణా చేస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత*…

*సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు*…

గుర్రంపోడ్//ప్రజావాణి//మార్చి 07

నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలంలో పేదలకు పంపిణీ చేయాల్సిన పిడిఎస్ (రేషన్) బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.మండలంలోని ఎరెడ్ల గూడెం వద్ద పోలీసులు తనికీలు చేస్తుండగా ఆటోలో (TS 05 UC 8447) తరలిస్తున్న 25 బస్తాలు (10 క్వింటాళ్ళు) పిడిఎస్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనలో బాద్యుడైన కామంచి శివకృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకన్న హెచ్చరించారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు