అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి – రైతులకు పూర్తి సహాయం అందిస్తాం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

ప్రజావాణిన్యూస్(మార్చి 19)అమరావతి రాష్ట్రంలో రాబోయే 3-4 రోజుల పాటు ఉరుములు, మెరుపులు,ఈదురుగాలులు (గంటకు 30-40 కి.మీ వేగంతో) వడగళ్లతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం అత్యవసర సమీక్ష నిర్వహించారు.వ్యవసాయ శాఖ ఇంచార్జ్ కమిషనర్,ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు,ఇతర ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం/ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని,ముఖ్యంగా రాయలసీమ,కోస్తాంధ్ర,ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉండే అవకాశముందని మంత్రి...