అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేత.
కోటగిరి/ప్రజావాణి:-మండల కేంద్రంలోని హరిజనవాడలో బుధవారం జెండా గంగారం అనే వ్యక్తి మృతి చెందారు. ఆయన అంత్యక్రియల నిమిత్యం తేల్ల రవి అన్న యువసేన ఆధ్వర్యంలో మృతుని కుటుంబాన్నీ పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో తేల్ల అరవింద్,తేల్ల రవికుమార్,కాలనీ పెద్దలు కన్నం సాయిలు, కన్నం శ్రీనివాస్,జెండా దినేష్,హస్గుల రవి,పండు,తదితరు లు పాల్గొన్నారు.